Telangana
/urls/202607317878
రేషన్ కార్డుల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు
హైదరాబాద్: రేషన్కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి గడువును మరో నెల రోజులు పొడిగించింది. ఈ-కేవైసీ చేయడానికి ఇవాళ ఆఖరి రోజు కావడంతో ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. ఈ-కేవైసీ చేయకుంటే రేషన్ పొందలేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేవైసీ చేయనప్పటికీ ఆగస్టు 31 వరకు రేషన్ పొందవచ్చునని స్పష్టం చేశారు. దీంతో రేషన్ లబ్ధిదారులకు ఊరట లభించినట్లయ్యింది.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *