International
/urls/202607316495
భారత్కు జిన్పింగ్ రాక?.. బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశం!
ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ను సందర్శించే అవకాశమున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన ఖరారైతే.. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం జిన్పింగ్ భారత్కు రావడమిదే తొలిసారి కానుంది.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *