‘నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
ఇంటర్నెట్ డెస్క్: యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త యువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రగ్స్కు దూరంగా ఉండేలా యువతలో స్ఫూర్తి నింపేందుకు ఒక సమగ్ర ప్రచారకార్యక్రమంగా ‘నషా ముక్త యువ’ను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. తాముంటున్న ప్రాంతాల్లో సానుకూల మార్పులకు కారకులుగా యువత నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు.వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు దేశ యువత ఆరోగ్యంగా ఉండటం అవసరమని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమం వ్యక్తులకే కాకుండా కుటుంబాలు, దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించామని అన్నారు. గతేడాది కాశీలో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే స్థాయికి విస్తరించిందని చెప్పారు. ఈ క్యాంపెయిన్లో 125 ఆధ్యాత్మిక సంస్థలు కూడా చేరాయని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం దిశగా కృషి చేస్తున్నాయని అన్నారు.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *