National
/urls/202607318491
పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..? చూడండి.
న్యూఢిల్లీ, జులై 31: ఎన్డీయే సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఆందోళన చేపట్టిన సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ)కి ఆయా పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో మోదీ సర్కారు దిగి రాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక రామమందిరంలో విరాళాల అపహరణపై సభలో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ ఎన్డీయే సర్కార్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతోంది. శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *